బ్రేకింగ్: 30 ఏళ్లుగా టెర్రరిస్టులను పెంచుతున్నాం, పూర్తిగా సిగ్గు వదిలేసిన పాక్‌

దిక్కుమాలిన పనులకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే పాకిస్థాన్‌.. మీడియా సాక్షిగా పూర్తిగా సిగ్గూ ఎగ్గూ వదిలేసింది. టెర్రరిస్టులకు తాము ఫండింగ్‌ ఇస్తున్నామంటూ ఓపెన్‌గానే ఒప్పుకుంటోంది.

  • Written By:
  • Publish Date - April 25, 2025 / 04:59 PM IST

దిక్కుమాలిన పనులకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే పాకిస్థాన్‌.. మీడియా సాక్షిగా పూర్తిగా సిగ్గూ ఎగ్గూ వదిలేసింది. టెర్రరిస్టులకు తాము ఫండింగ్‌ ఇస్తున్నామంటూ ఓపెన్‌గానే ఒప్పుకుంటోంది.

ఏకంగా పాకిస్థాన్‌ డిఫెన్స్‌ మినిస్టర్‌ ఖవాజా అసిఫ్ ఈ కామెంట్స్‌ చేశాడు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమాత్రం సిగ్గు లేకుండా తాము టెర్రరిస్ట్‌ ఆర్గనైజేషన్స్‌కు ఫండింగ్‌ ఇస్తున్నామంటూ చెప్పాడు. ఒకటి రెండూ కాదు ఏకంగా 30 ఏళ్ల నుంచి పాకిస్థాన్‌ ఈ పని చేస్తోందంటూ చెప్పాడు.