సాయిసుదర్శన్ సూపర్ ఫామ్, యువ క్రికెటర్ అరుదైన రికార్డ్

ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ అద‌ర‌గొడుతున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్ మ్యాచ్‌లో మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులు బాదాడు.

  • Written By:
  • Publish Date - April 10, 2025 / 07:26 PM IST

ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ అద‌ర‌గొడుతున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్ మ్యాచ్‌లో మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులు బాదాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. దీంతో గుజరాత్‌ 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేయడంలో సాయి సుద‌ర్శ‌న్ కీల‌క‌ పాత్ర పోషించాడు. ఇక ఈ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ద్వారా అత‌డు ఐపీఎల్‌ చరిత్రలో కొత్త మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్‌లో 30 ఇన్నింగ్స్‌ల తర్వాత 1,307 ర‌న్స్‌ చేసి రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. షాన్ మార్ష్ మాత్రమే అతనికంటే ముందున్నాడు. క్రిస్ గేల్ , కేన్ విలియమ్సన్ , మాథ్యూ హేడెన్ వంటి దిగ్గజాలు సుద‌ర్శ‌న్ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంతేగాక ఐపీఎల్‌లో ఒకే వేదిక‌పై వరుసగా ఐదుసార్లు 50కి పైగా స్కోర్లు చేసిన ఏకైక భారత క్రికెటర్ గానూ నిలిచాడు.