55 మంది మృతి.. 250 మంది సీరియస్‌ మయన్మార్‌లో మృత్యుఘోష

మయన్మార్‌లో, బ్యాంకాక్‌లో వచ్చి భూకంపం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మయన్మార్‌లో ఇప్పటి వరకూ 55 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు.థాయల్యాండ్‌లో నలుగురు వ్యక్తులు చనిపోయినట్టు చెప్తున్నారు.

  • Written By:
  • Updated On - March 29, 2025 / 08:25 PM IST

మయన్మార్‌లో, బ్యాంకాక్‌లో వచ్చి భూకంపం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మయన్మార్‌లో ఇప్పటి వరకూ 55 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు.థాయల్యాండ్‌లో నలుగురు వ్యక్తులు చనిపోయినట్టు చెప్తున్నారు. ఈ రెండు ఘటనల్లో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలిపోయిన బిల్డింగ్‌ల శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నారు. భూకంప ప్రభావం ఉన్న అన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారిని రెస్క్యూ టీం ఎప్పటికప్పుడు హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. ఈ ఘటనలో మృతు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ స్పందించారు. థాయిల్యాండ్‌, మయన్మార్‌కు అన్ని విదాలా అండగా ఉంటామంటూ ట్వీట్‌ చేశారు. ఇక మయన్మార్‌తో పాటు భారత్‌లో కూడా పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. మేఘాలయలో రిక్టర్‌ స్కేల్‌ మీద 4 మ్యాగ్నిట్యూడ్‌ తీవ్రత నమోదైంది. భారత్‌లో ప్రభావం అంతగా లేకపోయినా.. మయన్మార్‌, బ్యాంకాక్‌లో మాత్రం మృత్యు ఘోష కనిపిస్తోంది.